KNR: భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ సూచించారు. ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. స్వామివారి కళ్యాణం, బండ్లు, చిన్న రథం, పెద్ద రథోత్సవం, నఖబలి వంటి ప్రధాన ఘట్టాలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.