ADB: మైనర్ బాలిక అత్యాచార ఘటనపై ఇంచార్జ్ మంత్రి సీతక్క స్పందించకపోవడం సమంజసం కాదని BRS నాయకులు సాజిదోద్దీన్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో BRS నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు.