JGL: కథలాపూర్ మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయం ఆవరణలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, హెల్త్ కార్డు ఇవ్వాలని వారు కోరారు. వీరికి యూటీఎఫ్, డీటీఎఫ్, పీఆర్టీయూ నాయకులు మద్దతు ప్రకటించారు.