NZB: భీమ్గల్ మండలం పల్లికొండకు చెందిన గంగం అజయ్ (25)కి చెవి సర్జరీ చేస్తుండగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం ఆరోపణల నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యం బాధిత కుటుంబంతో రూ.23 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. రూ.5 లక్షలు నగదు చెల్లించగా, మిగిలిన రూ.18 లక్షలకు చెక్ ఇచ్చినట్లు సమాచారం.