JGL: వెల్గటూర్ మండలం కోటిలింగాల కోటేశ్వర ఆలయం వద్ద జరగబోయే పుష్కరాల ఏర్పాట్లను జిల్లా స్థాయి అధికారులు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, పారిశుధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.