KMM: ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సోమవారం సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. శ్రీరక్షా ఆసుపత్రి వైద్యురాలు మానస విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలు కాపాడే అవకాశాలు పెరుగుతాయని, అపస్మారక స్థితిలో ఉన్నవారికి సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను ఎలా రక్షించవచ్చో ఆమె వివరించారు.