KMR: మద్నూర్ మండలంలో వెంటనే శేనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో 8,500 ఎకరాల్లో సాగైన పంట ప్రస్తుతం చేతికి రావడంతో ఆరబెడుతున్నారు. అకాల వర్షాల భయం వెంటాడుతోందని, పంట నష్టపోకముందే ప్రభుత్వం స్పందించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు. ఆలస్యమైతే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.