BDK: మణుగూరు గుట్ట మల్లారం ప్రాంతంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఒలింపియాడ్ INTSO పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం తన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఒలింపియాడ్ సెకండ్ లెవెల్ జిల్లా గ్రాండ్ ప్రైజ్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి డి. ఉజ్వల్ ధీరన్ ల్యాప్టాప్ను గెలుచుకున్నారు.