MNCL: కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని విద్యార్థులకు సందర్భంగా సర్పంచ్ తోగురు శ్రీనివాస్ విద్యార్థులకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక, మానసిక ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.