MDK: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగా ఉందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు ఆరోపించారు. రామాయంపేట బీజేపీ కార్యాలయంలో ఇవాళ బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. విద్యారంగానికి కేవలం ఎనిమిది శాతం నిధులు కేటాయించడంపై మండిపడ్డారు. ఆరు గ్యారెంటీ పథకాలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు.