NRML: నిర్మల్ పట్టణంలోని కంచరోని చెరువు పూర్తిగా ఎండిపోవడంతో క్రీడా మైదానంలా కనిపిస్తోంది. కొద్దిపాటి నీరు మాత్రమే మిగిలి ఉండగా మత్స్యకారులు చేపలు పడుతున్నారు. నీటిలో గుర్రపు డెక్క పేరుకుపోయింది. చెరువులో పూడికను తొలగించి పునరుద్ధరించాలని పట్టణవాసులు నీటిపారుదల శాఖ అధికారులను కోరుతున్నారు.