HYD: ఆటోలో దాచిన బంగారం చోరీకి గురైన ఘటన హుస్సేనీ ఆలం పీఎస్ పరిధిలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. శనివారం మక్కా మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు ఓ వ్యక్తి ఆటోలో వచ్చాడు. ఆటోలో బంగారం దాచి, పార్కింగ్ ఏరియాలో ఆటోను పార్కు చేశారు. అనంతరం వచ్చి చూడగా బంగారం మాయమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.