GDWL: మల్దకల్ మండలం ఎల్కూరు రోడ్డుపై చెత్తకుండీలు నిండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన రహదారిపైనే వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రజా పాలన’ ప్రణాళికలో భాగంగా ఈ చెత్తను వెంటనే డంపింగ్ యార్డు తరలించి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.