NRPT: మక్తల్ మున్సిపాలిటీ 8వ వార్డులో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో సుమారు రూ.2.50 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పనులు జరుగుతుండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.