JGL: కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో మల్లన్న అగ్నిగుండాల కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం వేళ భక్తులు దేవాలయంలో పూజలు చేశారు. దేవాలయం ఆవరణలో అగ్ని గుండం తయారు చేశారు. కోరిన కోర్కెలు తీర్చు స్వామి అంటూ భక్తులు అగ్నిగుండం నుంచి కాలినడకన నడచి వెళ్లారు. ఈ ఉత్సవాలకు హాజరైన భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు.