KMM: సత్తుపల్లి మండలం ఎన్టీఆర్ కాలనీలో క్వారీలో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఆధార్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం మృతి చెందిన చిన్నారుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి వారి మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేశవ మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని ఆరోపించారు.