NLG: నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా..సోమవారం విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన నివాసానికి వెళ్లి వెంకన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యాన్ని కల్పించారు. వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.