MDK: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేసినట్లు వివరించారు.