కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. శనివారం ఒక్కరోజే మద్యం సేవించి వాహనాలు నడిపిన 553 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఒకరికి 5 రోజుల జైలు శిక్ష, మిగిలిన వారికి రూ.6,38,500 జరిమానా విధించారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకమనిహెచ్చరించారు