NRPT: వేసవికాలం దృష్ట్యా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామంలో గురువారం ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ కలాల్ రాజేందర్ గౌడ్ గ్రామపంచాయతీ ఆవరణలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామస్థులు, వృద్ధుల దాహాన్ని తీర్చించేందుకు ఈ సేవను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.