SRCL: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ధర్మ టీచర్ యూనియన్ (DTU), TPTF సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆదివారం వేములవాడలో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ నేతలు సంపతి రమేశ్, దూస సంతోశ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థుల పౌష్టికాహారం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంపై మాట్లాడడం సరికాదన్నారు.