ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) దీక్షభూమి వద్ద లంబాడీ భక్తులు గత నెల 15వ తేదీన 41 రోజుల సేవాలాల్ దీక్షకు స్వీకరించారు. దీన్ని పురస్కరించుకొని ఈ నెల 19న దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో కొత్తపల్లి నుంచి MHలోని కాశి పౌరాగఢ్ వరకు సుమారు 360 కి.మీ పాదయాత్రగా వెళ్లనున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు దేవేందర్ రాథోడ్ తెలిపారు.