NZB: సిరికొండ మండలం శ్రీ శేష సాయి లక్ష్మీనారాయణ మందిరంలో నవగ్రహాల విగ్రహాల ప్రతిష్ఠాపన కోసం దాతలు ముందుకు వచ్చారు. దువ్వూరు లక్ష్మీనారాయణ రెడ్డి, అర్జున్ రెడ్డి కుటుంబ సభ్యులు కలిసి రూ.70 వేల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు శనివారం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. దైవకార్యానికి ఆర్థిక సాయం అందించిన దాతల కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.