NRML: శ్రీరామ నవమి శోభాయాత్రల బందోబస్తుపై జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల బుధవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పహారా, సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రూట్ మ్యాప్స్ ముందుగానే ఖరారు చేసి, ట్రాఫిక్ నియంత్రణ కట్టుదిట్టంగా అమలు చేయాలని వారు సిబ్బందికి సూచించారు.