RR: కొందుర్గులోని లక్ష్మీదేవునిపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామలింగేశ్వర ఆలయానికి సీనియర్ న్యాయవాది చెంది మహేందర్ రెడ్డి 9 కిలోల కంచు గంటను అందజేశారు. గ్రామస్థుల సహకారంతో నిర్మించిన ఈ ఆలయానికి తన వంతుగా గంట, హారతి పళ్లెం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనను అభినందించారు. భక్తి భావంతో దాతలు ముందుకు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.