SRD: జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులకు ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు అదివారం తెలిపారు. మార్చి 2న తెలుగు, 4న హిందీ, 5న ఇంగ్లిష్, 6న గణితం, 7న ఫిజికల్ సైన్స్, 9న జీవశాస్త్రం, 10న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలన్నారు.