జనగామ: జిల్లా స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఈ సందర్భంగా రాజయ్యకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజయ్య చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ.. ఏసుప్రభు ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.