NGKL: లింగాల మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామం కాలనీలో రూ.5 లక్షల సీసీ రోడ్డు పనులు సోమవారం ప్రారంభించారు. నిధులు కేటాయించినందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అచ్యుత రెడ్డి, మాజీ సర్పంచ్ రవిశంకర్, నాయకులు జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.