RR: నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల్ మండలంలోని సాలార్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హమీ మేరకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని అన్నారు.