PDPL: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి రెడ్డి కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, కునారం, తదితర గ్రామాలలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత రైతులకు ధైర్యం చెప్పారు.