JGL: మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామంలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఈ వేడుకల్లో భాగంగా, మొదటిరోజు విశ్వక్సేన పూజ, స్వస్తి పుణ్యాహవచనము, రక్షాబంధనము తదితర పూజా కార్యక్రమాలతో ప్రారంభమై, చివరి రోజు 28న శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.