VKB: పులుమద్దిలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వెల్చల్, ఎర్రవల్లి వంటి పలు గ్రామాల్లో వర్షం దంచికొట్టడంతో దుర్గం చెరువు పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ అకాల వర్షం వల్ల చేతికి వచ్చిన మొక్క జొన్న పంటలతో పాటు టమాటా, వంకాయ వంటి కూరగాయల తోటలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.