MNCL: జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తండ్రి గోనె పోషం ఇటీవల మృతి చెందారు. విషయం తెలిసిన మంత్రి వివేక్ శుక్రవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.