భారత మహిళా జట్టు ఏప్రిల్లో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన కోసం ప్రకటించిన భారత జట్టులో ఇద్దరు కొత్త ప్లేయర్లకు చోటు దక్కింది. ఆల్రౌండర్లు కాశ్వీ గౌతమ్, అనుష్క శర్మ తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యారు. ఈ సిరీస్లో వీరు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 17, 19, 22, 25, 27 తేదీల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.