వైట్ బాల్ క్రికెట్లో MS ధోనీ తన కంటే గొప్ప కెప్టెన్ అని దిగ్గజ ప్లేయర్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ధోనీ భారత్కు 2011 వన్డే వరల్డ్ కప్ అందించాడని.. తాను జట్టును 2003 టోర్నీలో రన్నరప్గా మాత్రమే నిలపగలిగానని పేర్కొన్నాడు. తమ కాలంలో T20 WC లేదని, జార్ఖండ్ నుంచి తొలి క్రికెటర్ అయిన ధోనీ.. దిగ్గజంగా ఎదగడం చూసి గర్వపడుతున్నట్లు దాదా తెలిపాడు.