ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. అయితే, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పూర్తి ఫిట్నెస్తో ఉన్నప్పటికీ టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. తుది జట్టులో చోటివ్వడం కష్టంగా మారడంతో ఈ సిరీస్ నుంచి అతడిని విడుదల చేశారు. దీంతో సౌతాఫ్రికా-Aతో వన్డేలు ఆడనున్న భారత్-A జట్టుకు నితీష్ ప్రాతినిధ్యం వహించనున్నాడు.