భారత్లో టెస్టు సిరీస్ అంటే దక్షిణాఫ్రికాకు పెద్ద సవాల్ లాంటిదే. సౌతాఫ్రికాపై టీమిండియా స్వదేశంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గతంలో ఎనిమిదిసార్లు భారత్కు వచ్చిన సఫారీ జట్టు.. ఒక్కసారి మాత్రమే సిరీస్ నెగ్గగలిగింది. భారత్లో దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ గెలిచి 15 ఏళ్లు అవుతోంది. 2015లో 0-3తో, 2019లో 0-3తో ఆ జట్టు వైట్వాష్కు గురైంది.