తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకంలో నెలకొన్న సమస్యలను పట్టించుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం బడిపిల్లలతో కూడా రాజకీయం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. అనేక స్కూళ్లలో కనీస సౌకర్యాల లేమి, కార్మికులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతుండగా.. అల్పాహార పథకం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
మంత్రి తలసాని శ్రినివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా హోం మినిస్టర్ మహమూద్ అలీ తన సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్న విషయంపై తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించిందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అంతేకాదు ఇటివల పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ కూడా ప్రకటించినట్లు గుర్తు చేశారు.
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉన్నత పదవిలో ఉండి సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేవలం బోకే ఇవ్వనందుకే అలా చేస్తారా అంటూ అనేక మంది కామెంట్లు చేస్తున్నారు.
ఓ రాజకీయ నేత ఫోన్ నంబర్ నుంచి ఆకస్మాత్తుగా ఆశ్లీల వీడియోలు ఓ వాట్సాప్ గ్రూపులో షేర్ అయ్యాయి. అది తెలిసిన అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంత మంది అయితే ఓ మాజీ మంత్రి ఇలా చేయడమెంటని ప్రశ్నించారు. అయితే ఆ రాజకీయ నేత ఎవరో ఇప్పుడు చుద్దాం.
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న టీడీపీ, జనసేన, సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనలో పాల్గొనొద్దని చెప్పినా కూడా నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేశారని పోలీసులు మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.
మహిళలకు రాజకీయం వద్దు అన్న ఎంఐఎం పార్టీలో అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు రాజకీయ అరంగేట్రం చేస్తుందన్న సమాచారం బలంగా వినిపిస్తుంది. ఇప్పటివరకు పురుషాధిక్య పార్టీగా పేరున్న ఎంఐఎం త్వరలోనే ఆ అపవాదును తొలిగించే పనిలో ఉందని తెలుస్తుంది.
అక్టోబరు మొదటి వారంలో నారా భువనేశ్వరి ఓ "బస్సు యాత్ర"ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. అంతేకాదు అందుకోసం ఇప్పటికే రోడ్ మ్యాప్ సైతం పార్టీ వర్గాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు విడుదల ఆలస్యం పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈకేసులో లోకేష్ కు 41ఏ నోటీసులు ఇస్తామని, నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. అయితే 41ఏ నోటీసుల నేపథ్యంలో అరెస్టు ప్రస్తావన రాలేదు. ఈ క్రమంలో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణన...
తమిళనాడుకు కావేరీ జలాల్ని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా పలు సంఘాలు ఈరోజు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల 144 సెక్షన్ విధించి ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.