పచ్చగా ఉన్న టీడీపీ సర్వనాశనం కావడానికి ముఖ్య కారణం నారా లోకేష్ అని అంబటి ఆరోపించారు. తండ్రీకొడుకులు ఇద్దరు తప్పు చేశారని అందుకే బాబు ఊసలు లెక్కబెడుతున్నారని పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇస్తున్నా అని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన ఆదిలాబాద్ జనగర్జన సభలో బండి సంజయ్ రెచ్చిపోయారు. కేసీఆర్కు ఏం జరిగిందని, ఎందుకు బయటకు కనిపించడం లేదని, కేటీఆర్పై అనుమానం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్కు భద్రత పెంచాలని అన్నారు. అయితే ప్రస్తుతం సంజయ్ వ్యాఖ్యలు కేసీఆర్ గురించి కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఏపీలో అరాచకపాలన కొనసాగుతుందని బీసీలపై జగన్ ప్రభుత్వం అక్కసును వెల్లగక్కుతుందని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ అవినీతి పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమయిందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల వ్యయ పర్యవేక్షణ వ్యవస్థను కమిషన్ ప్రారంభించిందని, దీని సహాయంతో ఎన్నికలలో రాజకీయ పార్టీలు చేసే ఖర్చును పర్యవేక్షిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి రావడంతో నేతలు పార్టీ కార్యక్రమాల కోసం ప్రభుత్వ వాహనాలు, హెలికాప్టర్ వాడొద్దు.. రూల్స్ బ్రేక్ చేస్తే కమిషన్ చర్యలు తీసుకుంటుంది.
తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు.
తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని ప్రజలకు తెలియజేయాలని సీఎం జగన్ (CM Jagan) వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
టీడీపీ- జనసేన కమిటీకి సంబంధించి స్పష్టత వచ్చింది. సోమవారం మధ్యాహ్నాం ప్రకటించి.. ఆ వారంలో ఫస్ట్ మీటింగ్ నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ను టీడీపీ చీఫ్ చంద్రబాబు కోరారని తెలిసింది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్.. ఈ సారి పోటీ చేసే స్థానాన్ని సరిగా ఎంపిక చేసుకోవాలని.. అందుకే తిరుపతి పేరు సజెస్ట్ చేశారని తెలిసింది.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో పరిస్థితులు కష్టంగా ఉన్నాయని.. ఇక తాను రావాల్సిన అవసరం లేదన్నారు.