రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన త్వరలోనే అంతమవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైందని పేర్కొన్నారు. మరోవైపు యువతకు ఉద్యోగాలు లేవు, రైతులకు రుణమాఫీ లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరూ బాగుపడింది లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణలోని ములుగు జిల్లాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో రోడ్షో జరిగింది. చారిత్రాత్మక రామప్ప ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఈ మేరకు ప్రారంభించారు. మరోవైపు ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే నేడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించి కాంగ్రెస్ వియజభేరి బస్సు యాత్రను ప్రారంభించారు.
తెలంగాణలో ఇటివల పోటీపరీక్షల అభ్యర్థురాలు ప్రవళిక మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె కుటుంబానికి కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఉద్యోగార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పరిధిలో ఓ లారీ నిండా చీరలు తీసుకెళ్తుండగా పట్టుబడ్డాయి.
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఇలా జరగడం పట్ల కావాలనే చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ పొలిట్ బ్యూరో, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోనికి తీసుకుని.. ఆరోజు రాత్రి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజు కూడా గృహనిర్భంధంలో ఉంచారు. తల్లి వర్ధంతి ఉందని చెప్పిన వినిపించుకోకుండా ఇబ్బందిపెట్టారు. రవీంద్ర విషయంలో ప్రభుత్వ వైఖరి తనను ఎంతో బాధించిందని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ పదవీ కోరుకోవడం లేదని.. పదవులే తన వద్దకు వస్తాయన్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువత ముందుకు రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అనేక హామీలను పెంచిన కేసీఆర్..ఉద్యోగాల విషయంలో మాత్రం అలా చేయలేదన్నారు. అంతేకాదు వాటి ప్రస్తావనే లేదన్నారు. ఈ అంశాన్ని రాష్ట్రంలో నిరుద్యోగులు గుర్తుంచుకోవాలని రేవంత్ కోరారు.
తెలంగాణ జనసమితి (TJS) అధ్యక్షుడు కోదండరాం(kodandaram) అధికార పార్టీ మంత్రి కేటీఆర్(KTR)కు సవాల్ విసిరారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటివరకు రెండు లక్షలు కల్పించామని చెబుతున్న దాంట్లో నిజం లేదని అన్నారు. ఈ క్రమంలో ఈ అంశంపై మంత్రి కేటీఆర్ చర్చలకు రావాలని ఛాలెంజ్ చేశారు.
హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. వచ్చే ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళదామని సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ క్రమంలో ప్రమాణం చేసేందుకు కేసీఆర్ రావాలని రేవంత్ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు.
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీలో సీటు దక్కని అసంతృప్తి నేతలు ఇతర పార్టీలకు మారుతున్నారు. తాజాగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు రేవంత్ రెడ్డిని కలిశారు. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గరవుతున్న వేళ పార్టీ నేతలు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.