ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో అర్థం కూడా తెలియని వ్యక్తి దాని గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అక్కడి రాజకీయ నేతల్లో గుబులు రేపుతున్నాయి. ఎందుకంటే వచ్చే ఏడాది చివర్లో వస్తాయనుకున్న ఎన్నికలు మార్చిలోనే వస్తే చాలా తక్కువ సమయం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
విమర్శించిన వారే ఒక్కసారిగా పొగిడితే.. ఆ మజా వేరే. వివిధ కేసుల్లో జగన్ను సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తి.. ఇప్పుడు జగన్ పాలనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' అనే కార్యక్రమంలో భాగంగా మూడో రోజు తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో వైసీపీ పాలనలో జరుగున్న అరాచకాలను విన్నారు. ఈ క్రమంలో ఆమె నిజం తప్పక గెలుస్తుందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు కొన్ని రోజులు నుంచి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంటున్నారు. అయితే తన భద్రతతోపాటు ప్రాణాలకు కూడా ముప్పు ఉందని ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆర్జీవీ ఏదో ఒక పోస్ట్ పెట్టి వైరల్ అవుతూనే ఉంటారు. తాజాగా చంద్రబాబును ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది.
సీఎం కేసీఆర్ ను కొడంగల్ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే ఆహ్వానించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) తెలిపారు. ఒక వేళ కేసీఆర్ కొడంగల్లో పోటీకి రాకపోతే తానే కామారెడ్డి నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిస్తామని రేవంత్ అన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఈసీకి ఫిర్యాదు చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దీంతోపాటు అధికార పార్టీ నిబంధనలకు విరుద్ధంగా నియమించిన రిటైర్డ్ అధికారులను కూడా తొలగించాలని కోరినట్లు చెప్పారు.
మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లో 'పాలమూరు ప్రజాభేరి' పేరుతో అక్టోబర్ 31న నిర్వహించనున్న బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కీలక నేతలు అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించిన 'నిజం గెలవాలి' అనే కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ప్రజల గురించే చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించేవారని తెలిపారు.
చెన్నైలో రాజ్భవన్పై ఓ వ్యక్తి పెట్రోల్ బాంబ్ విసిరిన ఘటన కలకలం రేపింది. వెంటనే పోలీసులు బాంబ్ విసిరిన వ్యక్తిని అరెస్ట్ చేసి ఎందుకు పెట్రోల్ బాంబ్ విసిరాడని ఆరా తీశారు.
తెలంగాణలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె.. కే కవిత బీజేపీపై విరుచుకుపడ్డారు.