మేడిగడ్డ బ్యారేజిలో జరిగిన అన్యాయం కేంద్రానికి ఎందుకు కనిపించడం లేదు, సీబీఐ విచారణ ఎందుకు అదేశించడం లేదని టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ వందలకోట్ల అవినితీ చేశాడని ఆరోపించారు. కేసీఆర్, ఆయన కుటుంబం ఆర్థిక ఉగ్రవాదులని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు 39 మంది నాయకులను ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంను ఆరేళ్లపాటు రద్దు చేసింది. అయితే ఎందుకు అలా చేసింది ? ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణలో ఎన్నికలు ఉన్న క్రమంలో అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు ఆంధ్రా అభివృద్ధి గురించి మాట్లాడటం సరికాదని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath) స్పష్టం చేశారు. అంతేకాదు మీరు మీ ప్రాంతంలో చేసిన పనులు గురించి చెప్పుకోవాలని హితవు పలికారు.
ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం భూపేష్ బఘేల్(Bhupesh Baghel)పై ఈడీ(ED) పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎం భూపేష్ బఘేల్కు రూ.508 కోట్లు ఇచ్చారని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈడీ పేర్కొంది. ఈ రాష్ట్రంలో నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర అవినీతి, విఫలమైన ప్రాజెక్టుల లీకేజీలకు" "లక్షణ చిహ్నం"గా మారిందని ఆరోపించారు. అంతేకాదు ఇటివల మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను ప్రస్తావించారు.
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాలు సైతం ప్రచారం షురూ చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాని మోడీని ప్రచారంలో వినియోగించుకునేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో మోడీ ఈనెల 7, 11 తేదీల్లో రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ పశ్చిమ నియోజవర్గ టికెట్ దక్కకపోవడం వల్లనే నిరాశ చెంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ నేత ఏలూరి సాంబశివరావు కల్తీ మద్యం విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ మద్యం వల్ల రాష్ట్రంలో వేలమంది వాళ్ల ఆసుపత్రి పాలై వాళ్ల ప్రాణాలను పొగొట్టుకున్నారని ఆరోపించారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం BRS, BJP, AIMIM కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కొల్లపూర్లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరీ కాంగ్రెస్ సభలో భాగంగా పేర్కొన్నారు. అంతేకాదు అధికార కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం మహిళలను దోచుకుంటోందని, వాళ్ల తాళిబొట్లను తెంచి డబ్బు సంపాదించిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలోని రైతులు అల్లాడిపోతున్నారని నారా లోకేశ్.. ఏపీ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. వరి వేసిన పొలాల్లోనే రైతులు ఉరి వేసుకుంటున్నారని, వాళ్లని రక్షించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ పార్టీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించినట్లు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు తెలిపారు. అయితే చంద్రబాబు జైళ్లో ఉండటం సహా రాష్ట్రంలో కేవలం పలువురు సెటిలర్ల ఓట్ల కోసమే పోటీ చేయడం సరికాదని పలువురు చెప్పినట్లు తెలుస్తోంది.
మహిళా విలేకరితో అసభ్యంగా ప్రవర్తించినందుకు మలయాళ నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్ గోపీ చిక్కుల్లో పడ్డాడు. దీంతో సురేశ్ గోపీ సోషల్ మీడియా ద్వారా ఆ మహిళా జర్నలిస్ట్కు క్షమాపణ చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్కు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు. వైసీపీ అరాచక పాలనను అరికట్టి వాళ్లు కళ్లు తెరిపించాలని అన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో భాగంగా భీమిలిలో చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యాలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కంటే గౌరవంగా విధులు నిర్వర్తిస్తున్నామని ఆయన తెలిపారు.