సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి చేసి దోచుకున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi) వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు పగుళ్లు ఏర్పడినట్లు గుర్తు చేశారు. వీటికి ఎవరు బాధ్యత వహిస్తారని రాహుల్ కేసీఆర్ ను ప్రశ్నించారు. దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ పదవీ విరమణకు సిద్ధమని అంటున్నారని, ప్రజలు కూడా ఆయన్ను దించేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసిన సందర్భంగా ఈ మేరకు పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీలను వెంటనే అమలు చేస్తామన్నారు.
రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రచారంలో పాల్గొన్నారు. దేశాన్ని గ్లోబల్ సూపర్ పవర్గా మార్చే కలను బీజేపీ ప్రభుత్వం సాకాారం చేస్తుందని పేర్కొన్నారు. రైతులు సురక్షితంగా ఉండాలంటే మోడీ ప్రభుత్వమే మళ్లీ రావాలని అభిప్రాయంవ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఆమాాడ దూరంలో ఉందని, రౌడీల, గూండాల చేతుల్లో రాష్ట్రం అల్లాడిపోతుందని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నాడు. జనసేనతో పొత్తుగురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్, తాను ముక్కుసూటిగా వెళ్లే వ్యక్తులమని, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు జనాల్లోకి తీసుకెళ్తామని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదింటి ఆడబిడ్డల పెళ్లికి రూ.1 లక్ష నగదుతో పాటు తులం బంగారం స్కీం అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మెడ్చల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన కేసీఆర్, మల్లారెడ్డి కలిసి భూములను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం(Chidambaram) తాజాగా పేర్కొన్నారు. దీంతోపాటు హైదరాబాద్లోనే గ్యాస్ ధర అత్యధికంగా ఉన్నట్లు గుర్తు చేశారు. మరోవైపు రాష్ట్రంలో అప్పులు కూడా స్థాయికి మంచి పెరిగినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ప్రభుత్వంపై నిరాశతో ఉన్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేత, హుజురాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా తాను ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనని ఈటల అన్నారు. అంతేకాదు ప్రస్తుతం తన వద్ద ధైర్య లక్ష్మి మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు పలురకాలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్ బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి అయ్యేదని, గత పాలకులు ప్రజలను పట్టించుకోలేదని అన్నారు. రూ.340 కోట్లతో ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ రణరంగం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీకి ధీటుగా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వర్ధన్నపేట, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో పర్యటించిన క్రమంలో సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ 100 తప్పులు ఇప్పటికే పూర్తయ్యాయని రేవంత్ ఎద్దేవా చేశారు.
జగనన్న విద్యా కానుకలో భారీ స్కామ్ జరిగిందని జనసేన పార్టీ వ్యవహార ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ ఆరోపించారు. ఢిల్లీలో 5 కంపెనీలపై ఈడీ దాడి చేసిందని అవి ఏపీకి విద్యా కానుక కిట్లు సరఫరా చేసేవేనని పేర్కొన్నారు. నాసిరమైన షూలు, బ్యాగులు పంపిణీ చేసి విద్యార్థులకు కేటాయించిన నిధులకు గండీ కొట్టారని మండిపడ్డారు.
కేటీఆర్ సీఎం పదవీ చేపట్టిన తనకు అభ్యంతరం లేదని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా తమ పార్టీలో కుమ్ములాటలు ఉండవని తేల్చిచెప్పారు.
ఈరోజు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంయుక్త మేనిఫెస్టో కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన మేనిఫెస్టోలో 11 అంశాలను చేర్చనున్నట్లు కమిటీ సభ్యులు ప్రకటించారు. వాటిలో టీడీపీ నుంచి 6, జనసేన నుంచి 5 ప్రతిపాదనలు స్వీకరించారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. అయితే నామినేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారనే వివరాలు తెలియాల్సి ఉంది. నాగార్జునా సాగర్ నియోజకవర్గం నుంచి జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై జరిగిన దాడి ఘటన..అధికార పార్టీ డ్రామా అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సర్వసాధారణమని గుర్తు చేశారు. అంతేకాదు గతంలో జగన్ మోహన్ రెడ్డిపై కత్తితో దాడి చేయడం, మమతా బెనర్జీ కాలికి గాయం వంటి ఘటనలను ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎందుకు కావాలో ఒక్కరైనా సరైనా కారణం చెప్పండి అంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఆయన కొత్తగా చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు.