తెలంగాణ ఎన్నికల పోలింగుకు ముందే సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్(nagarjuna sagar) వివాదం పేరుతో తెలంగాణ సెంటిమెంట్ కుట్ర పన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని రేవంత్ ఎన్నికల సీఈఓను కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(central election commission) రియాక్ట్ అయ్యింది. ఈ అంశంపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు బాండ్ పేపర్లపై సంతకాలు చేశారు. అయితే కొందరు అభ్యర్థులు దేవాలయాలకు వెళ్లి పూర్తి చిత్తశుద్ధితో అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేయడం ప్రస్తుతం ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
తెలంగాణలో బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా అధికారంలో ఉండి ధనవంతులు కావడమే వారి లక్ష్యమని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(priyanka gandhi) అన్నారు. భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆమె బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ కేవలం ప్యాకేజీ స్టార్ అని, తెలంగాణలో బీజేపీకి, ఆంధ్రలో టీడీపీ కోసం పనిచేసే రాజకీయ వ్యభిచారి అని అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచే వాడు నాయకుడు ఎలా అవుతాడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయ నటుడివా లేక విటుడివా అని అంబటి వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కరీంనగర్లో ప్రధాని మోడీ ప్రర్యటించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని వెల్లడించారు. దీంతోపాటు మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తమ వంతుగా నేటితో చివరి ప్రయత్నం చేయనున్నారు. ఈ క్రమంలో మోడీ, అమిత్ షా సహా కాంగ్రెస్ పార్టీల నేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు.
ఖమ్మం నియోజకవర్గంలో ఎన్నికల హీట్ పెరిగింది. బీఆర్ఎస్ అరాచకపాలను అంతం చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నాడు. అంతే కాదు ఈ ఎన్నికల కోసం కోట్లల్లో బెట్టింగులు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపింది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తన మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ పార్టీ ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ సింగ్ రంధావా, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ సీపీ జోషి, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ 'జన్ ఘోషణ పాత్ర' మేనిఫెస్టోను విడుదల చేశారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క అర్ధరాత్రి ధర్నాకు దిగారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. బ్యాలెట్ పత్రంపై తన ఫోటో చిన్నగా ఉందని ఆమె తెలుపుతూ దానిని మార్చాలని కోరారు.
తెలంగాణలో ఎన్నికల వేళ మంత్రితోపాటు తిరుమలకు వెళ్లినందుకు ఇద్దరు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం మహబూబ్ నగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో వారి మాదిరిగా తప్పుడు వాగ్దానాలు చేయమని అన్నారు. శుక్రవారం ఏలూరు(eluru) జిల్లా నూజివీడులో జరిగిన రైతులకు హక్కు పత్రాల అందజేత కార్యక్రమంలో భాగంగా వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం, మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన అరెస్ట్, రాజీనామా గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో(Assembly Elections 2023) భాగంగా ఛత్తీస్గఢ్లో చివరి దశ, మధ్యప్రదేశ్ ఒకేదశ ఎన్నికల పోలింగ్ నేడు పూర్తింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా..ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఏ మేరకు పోలింగ్ శాతం నమోదైందో ఇప్పుడు చుద్దాం.