నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. MRPS లేవనెత్తుతున్న డిమాండ్లపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మోడీ రాక నేపథ్యంలో ఈ సభకు కీలక బీజేపీ నేతలు హాజరుకానున్నారు.
తెలంగాణలో పటాన్ చెరు కాంగ్రెస్ టిక్కెట్ గురించి చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి రాజకీయాలు రచ్చకెక్కాయి. ఇక్కడి స్థానిక నేత నీలం మధు టిక్కెట్ ఆశించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. కానీ కాంగ్రెస్ మొదట పేరు ప్రకటించి చివరి జాబితాలో పేరు లేకపోవడంతో తాజాగా మధు బీఎస్పీ పార్టీలో చేరారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థుల తుదిజాబితాలు వచ్చేశాయి. తాజాగా బీజేపీ 14 మందితోకూడిన లిస్టును ప్రకటించగా..నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ కూడా నలుగురితోకూడిన జాబితాను వెలువరించింది. అయితే సీట్ దక్కిన వారు సంతోషంగా ఉండగా..రాని వారు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
బెల్లంపల్లికి చెందిన శేజల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాదు చిన్నయ్య అనేక మంది అమాయకులపై అక్రమ కేసులు పెట్టించారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ(telangana congress) మైనారిటీ డిక్లరేషన్ ను ప్రకటించింది. అయితే దీనిని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్(salman khurshid) విడుదల చేయగా..దీనికి మైనారిటీ వర్గాలకు కీలకమైన హామీలను ప్రకటించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రువులతో చేతులు కలిపి ఆయన తనను జైలుకు పంపించాడని రేవంత్ వ్యాఖ్యలు చేశారు.
మొగలి రేకులు సీరియల్ నటుడు సాగర్ కు అరుదైన అవకాశం దక్కింది. ఇటివల జనసేన పార్టీలో చేరిన సాగర్ కు తెలంగాణ ఎన్నికల పార్టీ ప్రచార కార్యదర్శి పదవి లభించింది. అంతేకాదు తన స్వగ్రామమైన రామగుండం నుంచి కూడా సాగర్ పోటీ చేస్తుండటం విశేషం.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ పాల్గొన్న రోడ్ షోలో అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రచార వాహనం రెయిలింగ్ విరిగి పడడంతో పై నుంచి సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి కిందపడ్డారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సరిగ్గా అమలు అవుతున్నాయా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలను ప్రశ్నించారు. మాటలు కాకుండా పనులు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పవన్ ప్రజలను కోరారు.
తెలంగాణ బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి తమ భూములు ఆక్రమించారని గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. సుమారు 150 కోట్ల విలువైన 47 ఎకరాలు భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఈ భూమి ఎక్కడుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బకరా కాబోతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 50 మంది ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. ఆయా నేతలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి మారతారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరుపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటివల పుంగనూరులో దళితనేతపై పోలీసులు చిత్రహింసలు చేయడంపై మండిపడ్డారు. అంతేకాదు మంత్రి పెద్ది రెడ్డి పాలనలో ఈ అరాచకాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ మాటలను ఇకపై ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే రెండు స్థానాల్లో చిత్తుగా ఓడిపోతాడని కిషన్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు(chandrababu)ను హైదరాబాద్లో ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్(pawan kalyan) కలిసి దాదాపు రెండున్నర గంటలకు పైగా సుధీర్ఘంగా భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో సహా మరికొన్ని అంశాలను పవన్ ప్రస్తావించినట్లు తెలిసింది.
గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారు తప్పకుండా జైలుకు వెళ్తారని, వారి నంబర్ తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. అయితే కవిత, కేసీఆర్ పేర్లను ప్రస్తావిస్తు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.