• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

సీఎం జగన్ ఫోన్ ట్యాపింగ్ ని నమ్ముకోలే: సజ్జల

సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారని.. ఫోన్ ట్యాపింగ్ లను కాదని తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి వ్యవహారం, నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితిపై నోరు విప్పారు. చద...

February 1, 2023 / 01:38 PM IST

లోకేశ్ పాదయాత్ర వద్ద కలకలం.. వైసీపీ దుండగుల బీభత్సం

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించారు. లోకేశ్ బస చేసిన ప్రదేశానికి వచ్చి బీభత్సం సృష్టించారు. టీడీపీ ఫ్లెక్సీలు చించేసి రచ్చ చేశారు. అనంతరం తెలుగు తమ్ముళ్లపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల...

February 1, 2023 / 12:36 PM IST

నారా లోకేశ్ యువగళం ఆరవ రోజు పాదయాత్ర షెడ్యూల్

నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. గత ఐదు రోజులుగా 58.5 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. పలమనేరు నియోజకవర్గంలో పలు గ్రామాల మీదుగా యాత్ర సాగింది. లోకేశ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, సెల్ఫీ దిగేందుకు జనాలు పోటీలుపడ్డారు. అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మహిళలు దిష్టి తీసి, తిలకం దిద్ది, హారతి పట్టారు. నియోజకవర్గంలో వ్యవసాయ భూములను లోకేశ్ పరిశీలించారు. పొలాల్లో పనిచేస్తు...

February 1, 2023 / 08:41 AM IST

టార్గెట్ బీఆర్ఎస్.. ఐటీ దాడుల వెనుక రహాస్యం ఇదే?

తెలంగాణలో అధికార పార్టీ లక్ష్యంగా కేంద్ర సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలు రావడం, భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల నివాసాలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపడుతున్నారు. కొన్ని నెలల నుంచి ఈ దాడుల పరంపర కొనసాగుతోంది. ఎప్పుడు ఎవరి మీద దాడులు జరుగుతాయో తెలియడం లేదు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేయడం.. కేంద్ర సంస్థ...

February 1, 2023 / 08:21 AM IST

నవీన్ ఎవరు? జగన్ కు అతడికి మధ్య సంబంధమేంటి?

మాజీ మంత్రి వైఎస్ వివేకాంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా వెళ్తోంది. విచారణను వేగవంతం చేస్తున్నది. దర్యాప్తులో భాగంగా వైఎస్ అవినాశ్ రెడ్డితో విచారణ అనంతరం మరికొందరికి నోటీసులు పంపుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎంవోలో అతి ముఖ్యమైన వ్యక్తికి కూడా నోటీసులు పంపడం ఏపీలో కలకలం రేపుతోంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, ఇంట్లోని మనిషికి నోటీసులు అందడంతో సంచలనంగా మారింది. వివేకా హత్య కేసు మరకలు సీఎం ఇంటిన...

February 1, 2023 / 07:28 AM IST

జగన్ రాజధాని వ్యాఖ్యలపై బీజేపీ, టీడీపీ గుర్రు

ఢిల్లీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీ రాజధాని విశాఖపట్నమంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ నేతలు గుర్రుమంటున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. విశాఖ రాజధాని అని, తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నానని జగన్ చెప్పారని, కానీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు అన్నారు. ము...

January 31, 2023 / 08:58 PM IST

శాసన రాజధాని అమరావతిలోనే: జోగి రమేష్

ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న జగన్.. పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైనదని, విశాఖ రాజధాని కాబోతుందని, త్వరలో తాను కూడా షిఫ్ట్ కానున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజధాని మొత్తం అక్కడకు వెళ్తుందనే ప్రచారం సాగుతోంది. అలాగే, రాజధాని అంశం సుప...

January 31, 2023 / 08:16 PM IST

టీడీపీ హయాంలో కరువు, నెల్లూరు వైసీపీ సమస్యలు టీ కప్పులో తుఫాన్: మంత్రి కాకాణి

తెలుగుదేశం పార్టీ హయాంలో కరువు విలయ తాండవం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న కొన్ని వార్తా సంస్థలు ప్రచురించడం లేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వాస్తవ పరిస్థితులను మీడియాకు వెల్లడించారు. టీడీపీ హయాంలో పంటలు పండించకపోవంతో కరువు మండలాలుగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచే...

January 31, 2023 / 08:00 PM IST

టాపిక్ డైవర్షన్: వివేకా కేసు నేపథ్యంలో తెరపైకి విశాఖ: ఉమ

ఏపీ సీఎం జగన్‌పై మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. జగన్ అభద్రతాభావంతో ఉన్నారని మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్యకేసులో కుట్రదారులను సీబీఐ వెలుగులోకి తీసుకువస్తోందని తెలిపారు. ఈ అంశం నుంచి దృష్టి మరల్చేందుకే విశాఖ రాజధాని వ్యవహారం తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా సీఎం జగన్ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. జగన్ పై సుమోటోగా కోర్టు ధిక్...

January 31, 2023 / 07:22 PM IST

వైఎస్ భారతీతో మాట్లడాలంటే నవీన్‌కే ఫోన్ చేస్తా: వైవీ సుబ్బారెడ్డి

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నల వర్షం కురిపించారు. అవినాష్ కాల్ రికార్డులను పరిశీలించగా నవీన్‌తో ఎక్కువ మాట్లాడినట్టు గుర్తించారు. నవీన్.. సీఎం జగన్ భార్య భారతి పీఏ అని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో నవీన్ పాత్రపై సీబీఐ అధికారులు సందేహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నోటీసులు జారీచేశారు. నవీన్‌కు నోటీసులు ...

January 31, 2023 / 06:46 PM IST

కేఏ పాల్ హౌస్ అరెస్ట్.. ఎందుకంటే?

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి, కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభించడం ఏంటీ అని ప్రశ్నించారు. ఏప్రిల్ 14వ తేదీన సచివాలయం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ బర్త్ డే అని, ఆ రోజు వద్దన్నారు. సచివాలయం వద్ద నిరసన తెలిపేందుకు బయల్దేరగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు...

January 31, 2023 / 06:15 PM IST

బీసీలకు నిజమైన స్వేచ్చ 1983లోనే వచ్చింది.. నారా లోకేశ్

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బైరెడ్డిపల్లిలో కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశం అయ్యారు. జగన్ పాలనలో సమస్యలు ఎదుర్కొంటున్నామని వివరించారు. బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం 1983లో టీడీపీ గెలిచిన తరువాత వచ్చిందని నారా లోకేశ్ అన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ. కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా తమ పార్టీయేనని చెప్పారు. ...

January 31, 2023 / 05:49 PM IST

జగన్ సుప్రీంకోర్టును కూడా గౌరవించడం లేదు: సీపీఐ రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్టణం అవనుందని సీఎం జగన్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అప్పుడే ఎలా మాట్లాడతారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సుప్రీంకోర్టుని కూడా సీఎం జగన్ గౌరవించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ఇదీ జగన్ నిరంకుశ వైఖరికి నిదర్శనం ...

January 31, 2023 / 05:26 PM IST

చంపుతామంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెదిరింపులు

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. సోమవారం ఉదయం ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఇందుకు సంబంధించిన వ్యక్తిని గుర్తించారు. మనస్థిమితం లేని 38 ఏళ్ల వ్యక్తి ఈ ఫోన్ చేసినట్టుగా పోలీసులు కనుగొన్నారు. అతను అప్పటికే ఢిల్లీలోని గులాబీ బాగ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార...

January 31, 2023 / 04:30 PM IST

ఫోన్ ట్యాపింగ్.. ఫ్యామిలీతో వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నా: ఆనం

వైసీపీ అధినేత, సీఎం జగన్ లక్ష్యంగా రెబల్ లీడర్లు కామెంట్స్ చేస్తున్నారు. రఘురామ కృష్ణరాజు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ జాబితాలో ఆనం రాం నారాయణ రెడ్డి కూడా చేరారు. ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆనం రాం నారాయణ రెడ్డి జాయిన్ అయ్యారు. గత ఏడాదిన్నర నుంచి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి వీలులేకుండా...

January 31, 2023 / 04:30 PM IST