W.G: పోడూరు(మం) చింతలగరువు స్కూల్లో, టైలరింగ్ షాపులోను శనివారం టైలర్స్ డే జరిపారు. H.M. కొల్లాబత్తుల సూర్య కుమార్ మాట్లాడుతూ.. ఏలియాస్ హోవే రూపొందించిన ఆధునిక కుట్టుమిషన్కి 1846 ఫిబ్రవరి 28న పేటెంట్ లభించడంతో ప్రతి సంవత్సరం ప్రపంచ దర్జీల దినోత్సవంగా నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్ మట్టా నాగ రాజు, ట్రైనీ టీచర్ కే. సాయి లక్ష్మి, ఆంజనేయులు పాల్గొన్నారు.
KMM: చింతకాని (M) ఖమ్మం- బోనకల్ ప్రధాన రహదారి అయిన మత్కేపల్లి బస్ స్టాప్ వద్ద ఉన్న రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు తెలిపారు. రింగ్ రోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డు లేకపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మత్కేపల్లి రింగ్ రోడ్డు వద్ద తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
KMM: గిరిజన అభివృద్ధి శాఖ ఏటీడీవో కార్యాలయాన్ని ఖమ్మం కలెక్టరేట్ కు మార్చాలని PDSU ఖమ్మం జిల్లా అధ్యక్షులు గోకినపల్లి మస్తాన్ అన్నారు. శనివారం PDSU ఆధ్వర్యంలో గిరిజన అభివృద్ధి శాఖ జిల్లా అధికారి డి.డి. విజయలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఎస్టీ బాలుర వసతి గృహంలోనే ఏటీడీవో కార్యాలయం కొనసాగుతుండటంతో వసతి గృహ నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
వెస్టిండీస్తో రేపటి మ్యాచ్లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్లో జింబాబ్వేపై విజయం సాధించిన విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మరోసారి సంజూ, అభిషేక్ జోడీ ఇన్నింగ్స్ను ప్రారంభించనుంది. అదే ప్లేయింగ్-11తో విండీస్ను ఢీకొట్టేందుకు భారత్ సిద్ధమైంది.
WGL: NPDCL చరిత్రలోనే అత్యధిక గరిష్ఠ విద్యుత్ డిమాండ్ శనివారం నమోదైందని NPDCL CMD కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ WGLలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది మార్చి 11న 5816 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్ నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి లోనే 6057 మెగావాట్లు గరిష్ఠ డిమాండ్ నమోదు అయినట్లు తెలిపారు. వేసవి కాలంలో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
MNCL: లక్షెట్టిపేట పట్టణంలో నకిలీ నోట్లు చలామణి చేసిన అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశామని ఏసీపీ ప్రకాష్ తెలిపారు. శనివారం లక్షెట్టిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ నోట్లు చలామణి చేసిన 14 మందిని గుర్తించామని, అందులో 12 మందిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. వారి నుండి రూ.5,98,500 ఫేక్ కరెన్సీ, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
NRPT: రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాకు బెస్ట్ ప్రాక్టీసింగ్ అవార్డు లభించిందని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు తెలిపారు. FLN AI AXL కార్యక్రమాన్ని జిల్లాలోని పాఠశాలలో సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా అవార్డు లభించిందన్నారు. గణన సామర్థ్యాల బలోపేతం దిశగా జిల్లాలో ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టడంతో అవార్డు సాధ్యమైందని అన్నారు.
PLD: పెదకూరపాడు అంగన్వాడీ 3వ సెంటర్లో శనివారం బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. icds ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి హెచ్ఎం రమణ పాల్గొన్నారు. చిన్న వయసులో పిల్లలకు పెళ్లి చేయడం ద్వారా గర్భం దాల్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. పిండం అభివృద్ధి చెందక అంగవైకల్యం కలిగిన బిడ్డలు పుట్టే అవకాశం ఉందన్నారు.
WNP: సీవీ రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుసిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ విద్య ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. సైన్స్ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
MLG: వాజేడు మండలం పెనుగోలు కాలనీ పుసురు బీట్ పరిధిలో శనివారం అటవీశాఖ ఆధ్వర్యంలో వేసవి కాలంలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు గ్రామస్థులకు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని సూచించారు.
KNR: HYDలోని రెండు ఆసుపత్రుల్లో రోగి మృతికి వైద్యులే కారణమంటూ బంధువులు ఆసుపత్రి సిబ్బంది, సామగ్రిపై దాడి చేసిన ఘటనను ఖండిస్తూ జమ్మికుంట, హుజురాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో జమ్మికుంటలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ.. ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు కృషి చేస్తారని, అనూహ్య మరణాలపై దాడులు చేయడం సరైంది కాదన్నారు.
SKLM: పట్టణంలోని ప్రశాంతి ఓల్డ్ ఏజ్ హోమ్ ను జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ ఛైర్మన్ కె. హరిబాబు, ఆర్డీవో సాయి ప్రత్యూష శనివారం సందర్శించారు. ఈ మేరకు వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఛైర్మన్ హరిబాబు మాట్లాడుతూ, ప్రజలు తమ తమ రంగాల్లో ఎదుర్కొంటున్న న్యాయపరమైన ఇబ్బందుల నుంచి బయటపడేందుకు లీగల్ ఎయిడ్ క్లినిక్లను వినియోగించుకోవాలన్నారు.
NZB: ఒకవైపు ప్రకృతి కన్నెర్ర.. మరోవైపు ప్రభుత్వ ఉదాసీనతతో రైతాంగం అల్లాడిపోతోందని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్, నడిపి నాగన్న ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం బోధన్ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. డివిజన్ వ్యాప్తంగా నెలకొన్న సాగు సమస్యలను వివరించారు.
విశాఖ జిల్లాలో పీఎం సూర్యఘర్ యోజన అమలను వేగవంతం చేసి మూడు నెలల్లో లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో డీఆర్డీఏ, యూసీడీ గ్రూపుల ద్వారా లబ్ధిదారులకు అవగాహన కల్పించి బ్యాంకు రుణాలు, కేంద్ర రాయితీలు అందేలా చూడాలన్నారు. సమావేశంలో జేసీ విద్యాధరి పాల్గొన్నారు.
NLG: కుమ్మెరలో అగ్రకుల అహంకారానికి బలైన పసిపాప మృతికి DYFI ఆధ్వర్యంలో నల్గొండ, క్లాక్ టవర్ వద్ద ఇవాళ కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. నిమ్న కులస్తులనే నెపంతో దర్శనానికి అడ్డుపడి, బాధితులపై దాడి చేసి రెండు నెలల పాప మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ డిమాండ్ చేశారు.