• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పీఎం స్కీం నిధులు సక్రమంగా వినియోగించుకోవాలి’

KMM: సీవీఆర్ కళావేదికపై పీఎం జడ్పీహెచ్ఎస్ మడుపల్లి వార్షికోత్సవ వేడుకలు హెచ్ఎం తోట నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎమ్ఓ ప్రభాకరరెడ్డి హాజరయ్యారు. మధిర మండలంలో ఏకైక పీఎం హై స్కూల్, మడుపల్లి అని తెలియజేశారు. పీఎం స్కీం సౌకర్యాలను నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ జిల్లాలో అగ్రగామిగా ఉండాలని అన్నారు.

March 3, 2026 / 02:31 PM IST

ఆదోనిలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జైలు శిక్ష

KRNL: ఆదోని తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడిపిన నలుగురిపై కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. సోమవారం సీఐ నల్లప్ప మాట్లాడుతూ.. మొదటి అదనపు కోర్టులో హాజరుపరచగా, ఇద్దరికి ఏడు రోజులు, ఒకరికి పది రోజులు జైలు శిక్ష విధించారు. మరొకరికి రూ. 10 వేల జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

March 3, 2026 / 02:31 PM IST

‘రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమిలేదు’

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిలేదని బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలు అమలు చేయకుండా ప్రజల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు. నిధులు తరలించేందుకు తెలంగాణ పర్యటన చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 3, 2026 / 02:30 PM IST

‘కాంచన’ రీ-రిలీజ్ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్

నటుడు రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంచన’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా మార్చి 13, 2026న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ రీ-రిలీజ్ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్ అయింది. మార్చి 4న సాయంత్రం 6:03 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.

March 3, 2026 / 02:30 PM IST

6,441 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు: వరుణ్ రెడ్డి

WGL:TG నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGNPDCL) పరిధిలో ఇవాళ 6,441 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు TGNPDCL కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపారు. వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

March 3, 2026 / 02:29 PM IST

వరిలో ‘బెరుకు’ల బెడద.. రైతుల ఆవేదన

KMM: వరి సాగులో బెరుకుల సమస్య అన్నదాతలను కలవరపెడుతోంది. విత్తనాల కల్తీ వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ బెరుకులు పంట కంటే వేగంగా, ఎత్తుగా పెరిగి గాలి, వెలుతురు సోకకుండా అడ్డుకుంటున్నాయని.. ఫలితంగా దిగుబడి తగ్గుతోందని వాపోతున్నారు. అధికారులు సూచించిన జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదని, నాణ్యమైన విత్తనాలు అందించాలని కోరారు.

March 3, 2026 / 02:28 PM IST

ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ కార్యక్రమం

NLG: తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజావేదిక కార్యక్రమం జరగనుందని చిట్యాల ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. ఈ నెల 4న బుధవారం ఉ. 10 గంటలకు చిట్యాలలోని మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీలు జరగనున్నాయి. మండలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక ఉంటుందని తెలిపారు.

March 3, 2026 / 02:27 PM IST

తిరువూరు సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీల ధర్నా

NTR: తిరువూరు బోసుబొమ్మ సెంటర్లోని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు మంగళవారం ధర్నా నిర్వహించారు. విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యలని జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. జీతాలు పెంచే వరకు పోరాటం ఆగదని అంగన్వాడీలు నినాదించారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీనీ నెరవేర్చాలని కోరారు.

March 3, 2026 / 02:27 PM IST

‘రాష్ట్ర ప్రభుత్వమే నేరాల్ని ప్రోత్సహిస్తుంది’

AP: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం బుగ్గన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సంస్కృతులను తెచ్చారని విమర్శించారు. జోగి రమేష్ ఇంటిపై దాడి వీడియో చూస్తే అర్థమవుతుందని అన్నారు.

March 3, 2026 / 02:27 PM IST

హైకోర్టుకు బెదిరింపులు.. ఫేక్ మెయిల్

TG: హైకోర్టులో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాల్లో విస్తృత తనిఖీలు చేపట్టి.. అది ఫేక్ మెయిల్ అని స్పష్టం చేశారు. కోర్టు పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని తెలిపారు. అయితే ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

March 3, 2026 / 02:27 PM IST

హెల్త్ సెంటర్‌కు భూమిపూజ

NDL: పాములపాడు(మం) భానుముక్కలలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం భూమిపూజ చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్య సౌకర్యాల మెరుగుదల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. గ్రామస్తులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 3, 2026 / 02:25 PM IST

అనాధ ఆశ్రమంలో అన్నదానం, పండ్లు పంపిణీ

SRPT: కోదాడ పట్టణంలో శనగల రాధాకృష్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ ఆశ్రమంలోని మానసిక వికలాంగులు, చిన్నారులకు మంగళవారం హోళీ సందర్భంగా అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన జంపాల వెంకన్న-ఉమా దంపతుల ఆర్థిక సహకారంతో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సేవా సంస్థ తరఫున దాతకు అభినందనలు తెలిపారు.

March 3, 2026 / 02:25 PM IST

వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు

BHNG: శ్రీ భవాని రామలింగేశ్వరా స్వామి కళ్యాణమహోత్సవం, బ్రహ్మోత్సవం సందర్భంగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డికి దేవాలయ కమిటీ ఛైర్మన్ గుండగోని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్మన్ గడ్డం స్వప్న, సోమనర్సయ్య ఘనంగా స్వాగతం పలుకగా, ప్రత్కేక పూజలు చేసి కళ్యాణంలో పాల్గొన్నారు.

March 3, 2026 / 02:23 PM IST

సంజూ శాంసన్ నెట్ వర్త్ ఎంతంటే?

సంజూ శాంసన్ నికర ఆస్తి విలువ సుమారు రూ.80-90 కోట్లు ఉంది. IPL ఒప్పందం ద్వారా ఏడాదికి రూ.14 కోట్లు, బీసీసీఐ కాంట్రాక్టుతో ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తాడు. వీటితో పాటు మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీగా ఆదాయాన్ని పొందుతున్నాడు. క్రికెట్ మైదానంలోనే కాకుండా, ఆర్థికంగా కూడా సంజూ అత్యంత విజయవంతమైన ఆటగాడిగా దూసుకుపోతున్నాడని నివేదికలు చెబుతున్నాయి.

March 3, 2026 / 02:22 PM IST

T20 WC సెమీస్: అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు వీరే

సెమీఫైనల్ మ్యాచ్‌లకు ICC మ్యాచ్ రిఫరీలను ప్రకటించింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు రిఫరీగా జవగల్ శ్రీనాథ్ వ్యవహరించనున్నాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్‌లు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇక IND-ENG సెమీస్‌కు రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్, ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్‌లు వ్యవహరించనున్నారు.

March 3, 2026 / 02:22 PM IST