NTR: తిరువూరు బోసుబొమ్మ సెంటర్లోని సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు మంగళవారం ధర్నా నిర్వహించారు. విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యలని జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. జీతాలు పెంచే వరకు పోరాటం ఆగదని అంగన్వాడీలు నినాదించారు. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీనీ నెరవేర్చాలని కోరారు.