• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అమ్మవారికి రెండు బంగారు మంగళ సూత్రాలు వితరణ

అనకాపల్లి పట్టణం గవరపాలెంలో వేంచేసియున్న నూకాంబిక అమ్మవారికి విశాఖ నగరం చిన్న వాల్తేరుకు చెందిన పల్లా వెంకట చంద్రశేఖర్ శుక్రవారం 40 గ్రాముల బరువు గల రెండు బంగారు మంగళసూత్రాలు వితరణగా అందజేశారు. వీటిని అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ ఛైర్మన్ పీలా నాగ శ్రీను, ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి వై.శ్రీధర్‌కు వాటిని అందజేశారు.

February 21, 2026 / 05:30 AM IST

ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

JGL: మైనార్టీ ఈ స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జగిత్యాల జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఆర్ఎస్ చిత్రు తెలిపారు. తుర్క కాశి ముస్లిం వర్గానికి టూల్ కిట్లు, జనరేటర్ల పంపిణీ, మైనార్టీ యువతకు ఈ-స్కూటర్ల పంపిణీ పథకానికి ఈనెల 20 నుంచి మార్చి 1 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 05:27 AM IST

‘దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

MBNR: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సమాన అవకాశాలు, సహకారం లభించినప్పుడే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

February 21, 2026 / 05:25 AM IST

నూతన డీఎంహెచ్‌వోగా డా. దుర్గా రామ్ కుమార్

కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో)గా డాక్టర్ దుర్గా రామ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ రవీందర్ నాయక్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కూకట్‌పల్లి డీఎంహెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న దుర్గా రామ్ కుమార్ కామారెడ్డి జిల్లాకు బదిలీపై రానున్నారు.

February 21, 2026 / 05:22 AM IST

భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

GDWL: జిల్లాలో పెండింగ్ ఉన్న భూభారతి దరఖాస్తులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం IDOC కార్యాలయంలో తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం RDO స్థాయిలో 1370 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరగా క్లియర్ చేయాలని సూచించారు.

February 21, 2026 / 05:21 AM IST

మూల వాగులో విషాదం

SRCL: కొనరావుపేట మండలం కొండాపూర్ మూల వాగులో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం మూల వాగులో తాళ్లపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాక్టర్‌లో ఇసుక నింపుకొని వాగులో నుంచి బయటకు వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 05:19 AM IST

రేపు ద్వారకానగర్‌లో జల్లీ కట్టు

TPT: కొత్తపేటలోని ద్వారకానగర్‌లో ఆదివారం నిర్వహించనున్న జల్లీ కట్టు కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారికి ఇరువైపులా ఇసుక బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతకు నిర్భాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

February 21, 2026 / 05:16 AM IST

జాలర్‌కి చిక్కిన అరుదైన రబ్బర ఫిష్

కోనసీమ: సఖినేటిపల్లి ( M ) అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో రంగుల రబ్బర్ ఫిష్ జాలరికి చిక్కి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇది సుమారు ఒక కేజీ ఉన్నట్లు జాలర్లు తెలిపారు. ఈ రబ్బర ఫిష్ మొదటిసారిగా హర్బర్‌కు రావడం వల్ల అక్కడ ప్రజలంతా దాన్ని వింతగా చూశారు .

February 21, 2026 / 05:14 AM IST

మీకోసం కార్యక్రమానికి 81 ఫిర్యాదులు

అల్లూరి: పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయని వివరించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

February 21, 2026 / 05:13 AM IST

‘పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి’

ADB: ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించిన అనంతరం మహిళా సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గదిని ప్రారంభించారు. గ్రామాల్లో వీపీఓ విధానం అమలు చేస్తూ గంజాయి, గుడుంబా జరగకుండా రాయితీ బియ్యం, పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలలో సీసీటీవీ ఏర్పాటు చేయాలన్నారు.

February 21, 2026 / 05:11 AM IST

పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎస్పీ

ADB: ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించిన అనంతరం మహిళా సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గదిని ప్రారంభించారు. గ్రామాల్లో వీపీఓ విధానం అమలు చేస్తూ గంజాయి, గుడుంబా జరగకుండా రాయితీ బియ్యం, పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలలో సీసీటీవీ ఏర్పాటు చేయాలన్నారు.

February 21, 2026 / 05:11 AM IST

నేడు, రేపు రాష్ట్ర చదరంగం పోటీలు

TPT: రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు నేడు, రేపు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి షఫీదర్ తెలిపారు. షాప్ లీగ్ పోటీల్లో ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయంలో ఈ పోటీలు జరగనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు.

February 21, 2026 / 05:09 AM IST

గెస్ట్ లెక్చరర్ పోస్టుకు నేడే ఇంటర్వ్యూ

MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఆంగ్ల మాధ్యమంలో బోధించే అభ్యర్థులకు నేడు (శనివారం) మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ, డెమోకు హాజరుకావాలని ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారు ఉదయం 10 గంటలకు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 05:08 AM IST

నేడు చిన్నగంజాంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

BPT: చిన్నగంజాం మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు మండల ఏఈ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లైన్ల మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పెద్దగంజాం, కొత్తపాలెం, ములగనవారిపాలెం, నీలాయపాలెం, రాజుబంగారుపాలెం గ్రామాల్లో కరెంటు ఉండదని కావున ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

February 21, 2026 / 05:05 AM IST

మైనార్టీల కోసం ప్రత్యేక పథకాలు

KNR: రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రెండు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించిందని జిల్లా మైనారిటీ అధికారి వి.జగదీశ్వర్ తెలిపారు. tgobmms పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.1.50 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.1.20 లక్షల సబ్సిడీ, ముస్లిం బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారికి రూ.60వేల యూనిట్ విలువతో పథకం అమలు చేస్తున్నామన్నారు.

February 21, 2026 / 05:05 AM IST